బావమరిది ఇలాకాలో బావపై వ్యంగ్యాస్త్రాలు వేసిన జగన్..
ప్రచారంలో భాగంగా దూసుకుపోతున్న జగన్ పాలనలోకి వచ్చిన ఈ 59 నెలలలో ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేసామని.. ఈరోజు అన్ని హామీలు నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మరొకసారి వచ్చారని పేర్కొన్నారు. బాలకృష్ణ అడ్డ ఆయన హిందూపురంలో నిర్వహించిన ప్రచార భేరిలో ప్రసంగించిన జగన్ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సందించారు. మరో తొమ్మిది రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని చెప్పిన జగన్.. ప్రజలు ఇక్కడ కేవలం నాయకుల్ని ఎన్నుకోవడం లేదని.. తమ భావితరాల భవిష్యత్తును ఎన్నుకుంటున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి పొరపాటున ఓటు వేస్తే అనకుండా నోట్లో తలపెట్టినట్టే అని అన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి చంద్రబాబు చేయలేనివి ఐదు సంవత్సరాల లో తాను చేశాను అని పేర్కొన్న జగన్ తనకు మరొకసారి కూడా అవకాశం ఇవ్వవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు. ప్రతి ఇంటికి తన పథకాలు అందాయని.. ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉందని జగన్ పేర్కొన్నారు. హిందూపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ కులానికి చెందిన దీపిక.. ఎంపీ అభ్యర్థిగా బోయ శాంతి నిలబడ్డారు. వీరికి ఓటు వేసి గెలిపించాలని జగన్ ప్రజలను కోరారు. ఈనాడు పెన్షన్ కోసం అవ్వ తాతలు పడుతున్న కష్టానికి మూలం చంద్రబాబు అని.. పదవిలోకి రాకముందే ఇలా ప్రవర్తించిన బాబు రేపు పదవి వచ్చాక ఎలా ప్రవర్తిస్తాడో ఆలోచించుకోండి అని జగన్.