ASBL NSL Infratech

బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో అవినీతే : జేపీ నడ్డా

బీఆర్ఎస్ హయాంలో  అన్ని రంగాల్లో అవినీతే  : జేపీ నడ్డా

దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని తిరిగి మళ్లీ ఏర్పాటు చేస్తామని, ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్‌, వినోద్‌రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను మోదీ సాకారం చేశారు. మా ప్రభుత్వం ఎంతో దైర్యంగా ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. ఎస్టీల అభివృద్ధి కోసం ఎంతో చేసింది. ఇప్పటికే గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మా పాలనలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ ఇస్తున్నాం. మరో ఐదేళ్లు కొనసాగిస్తాం. 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చాం. మరో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తాం. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి చికిత్స లభిస్తుంది. భవిష్యత్‌లో పైపులైన్‌ ద్వారా ఇంటింటికి గ్యాస్‌ సరఫరా చేస్తాం. మోదీ ఎప్పుడూ పేదలు, రైతులు, మహిళల గురించే ఆలోచిస్తారు అని అన్నారు.

కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసింది. తెలంగాణకు ఇచ్చే పనుల వాటా 3 రెట్టు పెరిగింది. కానీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్థ పాలన కూడా చూస్తున్నాం. ఇండియా కూటమిని ఆయా పార్టీల వారసుల కోసమే ఏర్పాటు చేశారు. కూటమిలోని నేతలంతా కుంభకోణాలకు పాల్పడ్డారు. కేసీఆర్‌ కుమార్తె కవిత ఢిల్లీ మద్యం కేసు కుంభకోణంలో జైలులో ఉన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతే. వారి ప్రభుత్వంలో సంఘవ్యతిరేక శక్తులన్నీ విజృంభిస్తాయి అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :