ASBL NSL Infratech

సరికొత్త రికార్డు... ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది

సరికొత్త రికార్డు... ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది

దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త  గరిష్ఠాలకు చేరింది. ఈ నెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. మొత్తం 6,128 విమాన సర్వీసులు వీరిని చేరవేశాయని పౌరవిమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి. కొవిడ్‌కు ముందు రోజువారీ విమాన ప్రయాణికుల సగటు 3,98,579 తో పోలిస్తే ఇది 14 శాతం ఎక్కువ. ఇంతకుముందు 2023 ఏప్రిల్‌ 21న 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది దేశీయ మార్గాల్లో ప్రయాణించారు. భారత దేశీయ విమానయాన రంగం రోజూ కొత్త గరిష్ఠాలకు చేరుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :