కాగ్నిజెంట్ సంచలన నిర్ణయం... హైదరాబాద్, చెన్నైలో
టాప్ టెక్ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. సాధారణంగా కాస్ట్ కటింగ్ పేరిట టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చును తగ్గించుకుంటాయి. అయితే, కాగ్నిజెంట్ మాత్రం ఉద్యోగాల్లో కోత విధించడంతో పాటు ఆస్తులను కూడా విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్, చెన్నైలోని తన ఆస్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. రెండేళ్లలో రూ.3,300 కోట్లను ఆదా చేసే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 10 ఎకరాల క్యాంపస్ను, చెన్నై సిరుసేరిలోని 14 ఎకరాల క్యాంపస్ను విక్రయించాలని కాగ్నిజెంట్ యోచిస్తున్నట్లు సమాచారం.
Tags :