రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (31వ తేదీన) పర్యటించనున్నారు. రైతులు, ప్రజలను కలిసి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి 13 జిల్లాల నుంచి ముఖ్య నాయకులు హాజరయ్యారు. ముఖ్యంగా గత 13 రోజులుగా రాజధాని గ్రామాల్లో రైతులు మూడురాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకు సంఘీభావం ప్రకటించేందుకు పవన్ ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు.
Tags :