ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గెలిపించిన రైతులనే పెయిడ్ ఆర్టిస్టులని హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ నత్తి మాటలతో రైతులకు నిద్రలేకుండా చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకీ ఓటేసినందుకు సిగ్గుపడుతున్నామని, వైసీపీ కార్యకర్తలే టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుట వాపోయారని చెప్పారు. రాజధాని రాకుండా ఆళ్ల ఎన్ని కేసులు వేశారో అందరికీ తెలుసన్నారు. 7 గ్రామాల వాళ్లు వచ్చి ధర్నా చేస్తే స్పందించాలా అంటూ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ హేళన చేశారని అనురాధ ధుయ్యబట్టారు.
Tags :