Kavitha :కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తాం : కవిత

మాజీ సీఎం కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరపున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. కాళోజీ (Kaloji) జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడూతూ ఉన్నతమైన ఆశయాలతో అడుగు వేయాలని ఆలోచిస్తున్నాం. ఉన్నతమైన లక్ష్యం దిశగా సంప్రదింపులు జరుపుతున్నాయి. సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి కార్యకర్తలు విశ్రమించబోరు. సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం. కేసీఆర్ (KCR) అజెండాను తెలంగాణ జాగృతి తరపున ముందుకు తీసుకెళ్తాం. కాళోజీ స్ఫూర్తితోనే అందరమూ పని చేశాం. ఐలమ్య స్ఫూర్తితో అందరూ విజృంభించి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికి వన్నె తెస్తారు అని అన్నారు.