సక్సేనా కమిటీ సిఫారసుల మేరకే రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్

తెల్లరేషన్ కార్డుల పంపిణీకి విధివిధానాలపై తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష వార్షిక ఆదాయం లేదా మాగాణి 3.50 ఎకరాలు, లేదా చెలక 7.5 ఎకరాల లోపు భూమి ఉన్నవారినే ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల గరిష్ట వార్షికాదాయం ఉన్న వారినే అర్హులుగా నిర్ణయించాలని సూచించారు. అన్ని పార్టీలు, ప్రజా ప్రతినిధుల సలహాలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి సూచనలు తీసుకోవాలని నిర్ణయించింది. రెండు రాష్ట్రాల్లో రేషన్ కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సక్సేనా కమిటీ సిఫారసులను రేషన్ కార్డుల మంజూరుకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులుండగా పెండిరగులో 10 లక్షల దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు.