Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంతో మరొక మైలురాయి పడింది. చర్లపల్లి(Cherlaplly Terminal) రైల్వే టెర్మినల్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సాకేతిక అత్యాధునిక సౌకర్యాలతోరూ”413 కోట్లతో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వర్చువల్ గా పాల్గొన్నారు. కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు చర్లపల్లి టెర్మినల్ ప్రారం భోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు.
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం కావడంతో నేటి నుంచి ఈ రైల్వే టెర్మినల్ లో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. నేటి నుంచి ఈ రైల్వే టెర్మినల్ నుంచి 13జతల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం, కోల్ కత్తా రూట్లలో వెళ్లే రైళ్లను చర్లపల్లి మీదుగా నడిపించనున్నట్టు ఇప్పటికే అధికారులు వెల్లడించారు.
– జి.సురేందర్, భూవిజన్ న్యూస్