తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. రూ.3,500 కోట్లతో
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ ఆలీ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో పెట్టుబడుల కార్యాచరణను ప్రకటించారు. ఇప్పటికే రూ.300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు లేదా సెప్టెంబర్లో షాపింగ్ మాల్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే లులూ మాల్కు సంబంధించి 80 శాతం పనులు పూర్తి అయ్యాయని వెల్లడిరచారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్స్లో ఒకటైన లులూ గ్రూప్ సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. లులూ సంస్థ పెట్టుబడులతో తెలంగాణ టూరిజం పెరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. ప్రపంచ స్థాయి సంస్థలతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలోనే ఉందని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు.






