Khairatabad Ganesh:గంగమ్మ ఒడికి బడా గణేశ్ …ఘనంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిది. ఎన్టీఆర్ మార్గ్ లోని బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్యానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు వినాయకుడికి ఉత్సవ సమితి నిర్వాహకులు తుది పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు బడా గణేశ్ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. రాజ్దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదగా వినాయకుడు ఎన్టీఆర్ మార్గ్కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంతోపాటు ఎన్టీఆర్ మార్గ్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.