Supreme Court :ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్

కారు గుర్తుపై గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ (Speaker) నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది. కడియం (Kadiyam) శ్రీహరి, తెల్లం వెంకట్రావు(Venkat Rao) , దానం నాగేందర్ (Nagender) కు వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు తీర్చు ఇచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్ కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ప్రస్తావించింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.