Bandi Sanjay: అసెంబ్లీలో ఇలాంటి మాటలకు స్థానం లేదు
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambasiva Rao) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ (Assembly)లో ఇలాంటి మాటలకు స్థానం లేదన్నారు. దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణ కోల్పోయిందని, ఇలాంటి బాధ్యతలేని అసభ్యకరమైన భాషే ఇందుకు కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణ అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలను స్పీకర్ అనుమతించడం బాధాకరం. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ దూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. తక్షణమే కూనంనేని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. దేశ ప్రజలకు, ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.






