MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC elections) షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది. మార్చి 29 నాటికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh )లో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి.అశోక్బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ముగియనుంది. తెలంగాణ(Telangana) లో పదవీకాలం ముగిసే వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజూల్ హాసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ (Schedule)ను విడుదల చేసింది.
ఎన్నికల నోటిఫికేషన్ జారీ : మార్చి 3
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం : మార్చి 10
నామినేషన్ల పరిశీలన : మార్చి 11
నామినేషన్ల ఉపసంహరణ : మార్చి 13
పోలింగ్: మార్చి 20 ( ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు )
ఓట్ల లెక్కింపు : మార్చి 20 (పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి).