Tirumala: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించేందుకు అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడిరచింది. ఈ మేరకు టీటీడీ (TTD) ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ (Telangana) నేతల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారం ( సోమ, మంగళవారం దర్శనాలకు) మాత్రమే లేఖలు స్వీకరిస్తామని తెలిపింది. బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక ప్రదేశ దర్శనాలకు ( ఏ రోజుకు ఆ రోజే) లేఖలు అనుమతిస్తామని స్పష్టం చేసింది. నిర్దేశిత రోజుల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక లేఖ (Letter) మాత్రమే (ఆరుగురు భక్తులకు మించకుండా) స్వీకరిస్తామని వెల్లడిరచింది. ఈ విధానం మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడిరచింది.