TTD: టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం

బెంగళూరుకు చెందిన టీవోల్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఓ వాహనాన్ని విరాళంగా అందించింది. రూ.15,94,962 విలువైన మొంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ (Montra Electric Aviator) వాహనాన్ని ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తాళాలను టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథానికి (Deputy EO Lokanatham)అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanuprakash Reddy) తదితరులు పాల్గొన్నారు.