Courts: ఏపీలో రెండు కోర్టులకు బాంబు బెదిరింపులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం (Anantapur), చిత్తూరు కోర్టులకు (Court) బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు (Bheemarao) తెలిపారు. మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను న్యాయాధికారులు పోలీసులకు అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చిత్తూరు (Chittoor) జిల్లాలోని మిగిలిన కోర్టులోనూ తనిఖీలు చేపట్టారు.






