Tirumala: తిరుమల పరకామణిపై ..హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ పరకామణి (Parakamani) కానుకల లెక్కింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించాలని టీటీడీని ఆదేశించింది. ఏఐ (AI), అత్యాధునిక యంత్రాలను వినియోగించాలని సూచించింది. దొంగతనాలను అరికట్టేందుకు రెండు దశల్లో సంస్కరణలు చేపట్టాలని, తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది. హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపులో భద్రతా చర్యలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశిచింది. కానుకలను వర్గీకరించడంతో పాటు విదేశీ కరెన్సీని గుర్తించేందుకు ఏఐని ఉపయోగించాలని సూచించింది. విలువైన లోహాలను వేరే చేసే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీనిపై 8 వారాల్లోపు ముసాయిదా రూపొందించి సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.






