Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Bnews » Hindenburgs shocking report puts madhabi puri buch in the spotlight and indias market regulator under scrutiny

సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురిబచ్ పై హిండెన్ బర్గ్ తాజా ఆరోపణలు

  • Published By: techteam
  • August 13, 2024 / 12:06 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Hindenburgs Shocking Report Puts Madhabi Puri Buch In The Spotlight And Indias Market Regulator Under Scrutiny

సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌పై, అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను కొనసాగిస్తోంది. ఆమెకు వాటాలున్న కన్సల్టింగ్‌ సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సవాలు విసిరింది. ‘హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు, సెబీ విశ్వసనీయతపై దాడి అని, తమ వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం’ అంటూ మాధబి, ఆమె భర్త ధావల్‌ పేర్కొన్న గంటల వ్యవధిలోనే హిండెన్‌బర్గ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. బెర్ముడా/మారిషస్‌ ఆఫ్‌షోర్‌ ఫండ్లలో తనకు పెట్టుబడులు ఉన్నట్లు మాధబి ఒప్పుకొన్నారని, అదానీ సంస్థలో డైరెక్టరుగా ఉన్న తన భర్త బాల్యమిత్రుడు ఆ ఫండ్‌ను నిర్వహించినట్లు కూడా ధ్రువీకరించారని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. ఇవన్నీ చూస్తే కొన్ని కొత్త సందేహాలూ వస్తున్నాయని తెలిపింది.

Telugu Times Custom Ads

హిండెన్‌బర్గ్‌ తాజా ఆరోపణలు..

‘భారత్, సింగపూర్‌లలో తాను ఏర్పాటు చేసిన రెండు కన్సల్టింగ్‌ కంపెనీల కార్యకలాపాలు.., 2017లో తాను సెబీలో ఆపేసినట్లు మాధబి స్వయంగా చెప్పారు. 2019లో వాటిని ఆమె భర్త టేకోవర్‌ చేశారని నమ్మబలికారు. తాజా వాటాదార్ల వివరాల ప్రకారం.. అగోరా అడ్వయిజరీ లిమిటెడ్‌ (ఇండియా)లో 2024 మార్చి 31 నాటికి మాధబి పురి బచ్‌కే 99% వాటా ఉంది. ఇప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తూ, ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అగోరా పార్ట్‌నర్స్‌ సింగపూర్‌లోనూ 2022 మార్చి 16 వరకు ఆమె 100% వాటాదారుగా ఉన్నారు. సెబీ పూర్తి కాల సభ్యురాలిగా ఉన్న సమయమంతా, ఆమె ఈ వాటా కలిగి ఉన్నారు. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన 2 వారాల తర్వాత, ఆ సంస్థలో తన వాటాను ఆమె తన భర్తకు బదిలీ చేశారు. అయితే సింగపూర్‌ సంస్థ తన లాభదాయ వివరాలను బహిర్గతం చేయని కారణంగా.. సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న సమయంలో మాధబి ఈ సంస్థ ద్వారా ఎంత ఆర్జించారో తెలుసుకోవడం కష్టమంది.

భారత సంస్థలో ఇప్పటికీ మాధబికి 99% వాటా ఉండగా.. ఆమె సెబీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న (2021-22, 2022-23, 2023-24) సమయంలో ఈ సంస్థ రూ.2.40 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సెబీలో పూర్తి కాల సభ్యురాలిగా ఉన్న సమయంలోనే, మాధబి తన వ్యక్తిగత ఇ-మెయిల్‌ ఉపయోగించి తన భర్త పేరు మీద వ్యాపారం నిర్వహించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇప్పుడు ఆమె అధికారిక హోదాలో ఉంటూ మరేదైనా ఇతర వ్యాపారాలను తన భర్త పేరు మీద నిర్వహించారా? అనే సందేహాన్ని ఇది రేకెత్తిస్తోంది. ఈ అంశాలన్నింటిపై పారదర్శక దర్యాప్తునకు మాధబి సిద్ధపడాలి, ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి’ అని హిండెన్‌బర్గ్‌ సూచించింది.

మాధబికి రీట్స్‌ సంఘం మద్దతు

సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌కు స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్స్‌), ప్రత్యామ్నాయ పెట్టుబడుల సంఘాలు మద్దతుగా నిలిచాయి. ‘రీట్స్‌పై సెబీ రూపొందించిన విధానం, కొంతమందికి ప్రయోజనం చేకూర్చడమే కోసమే’ అంటూ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఇండియన్‌ రీట్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. దేశీయ, అంతర్జాతీయ మదుపర్లతో పాటు చిన్న మదుపర్ల ప్రయోజనాలకు అత్యంత భద్రత చేకూర్చేలా వివిధ వర్గాల సూచనలతో సెబీ, సెబీ నాయకత్వం కఠిన నియంత్రణా విధానాలను రూపొందించాయని ప్రశంసించింది. బచ్‌కు అండగా నిలుస్తున్నామని ద ఇండియన్‌ వెంచర్‌ అండ్‌ ఆల్టర్నేట్‌ కేపిటల్‌ అసోసియేషన్‌ తెలిపింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై సెబీ, సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి తమ స్పందన తెలియజేశారని, అంతకుమించి తాము చెప్పేది ఏమీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ తెలిపారు.

అదానీ గ్రూపుపై దర్యాప్తు విషయంలో సెబీ ఛైర్‌పర్సన్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అవరోధంగా నిలుస్తున్నాయంటూ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మాజీ బ్యూరోక్రాట్‌ ఇ.ఎ.ఎస్‌.శర్మ లేఖ రాశారు. ‘సెబీ ఛైర్‌పర్సన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం. సెబీ కాకుండా ప్రభుత్వం, దాని సంస్థలతో సంబంధం లేని ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించి, ఆ ఆరోపణల్లో నిజానిజాలను వెలుగులోకి తేవాలి’ అని ఆయన తెలిపారు.

 

 

 

Tags
  • Hindenburg
  • Madhabi Puri Buch
  • report
  • SEBI

Related News

  • Us Insurance Giant Hartford Opens Technology Center In Hyderabad

    Hartford : హైదరాబాద్‌లో హార్ట్‌ఫోర్డ్‌ సెంటర్‌

  • Brs Focus On Jubilee Hills By Election

    BRS: బీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక

  • Raja Singh Comments On Kishan Reddy

    Raja Singh: బీజేపీకి తలనొప్పిగా మారిన రాజాసింగ్

  • Rbi Acquires Above 4 Acre Nariman Point Land From Mmrcl For Rs 3472 Crore

    RBI: ఆర్‌బీఐ కళ్లు చెదిరే డీల్‌.. రూ.3,472 కోట్లతో

  • Crisis In Indias Neighboring Countries Is China To Blame

    India – China: భారత్ పొరుగు దేశాల్లో సంక్షోభం.. చైనాయే కారణమా..?

  • Asi Submits Crucial Report On Tirumala Srivari Temple Pink Diamond

    Pink Diamond: తిరుపతి లో పోయింది అని ఆరోపణలు వచ్చిన పింక్ డైమండ్ గురించి లేటెస్ట్ అప్డేట్

Latest News
  • KTR: కేటీఆర్‌కు గ్రీన్‌ లీడర్‌షిప్‌ అవార్డు
  • Hartford : హైదరాబాద్‌లో హార్ట్‌ఫోర్డ్‌ సెంటర్‌
  • TTD: టీటీడీ బోర్డు సభ్యునిగా టీవీఎస్‌ మోటార్స్‌ సీఎండీ సుదర్శన్‌ వేణు
  • MATA NJ టెన్నిస్ టోర్నమెంట్ – విజయవంతంగా ముగింపు
  • ATA: ఆటా ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలు
  • Dallas Dasara: డల్లాస్ దసరా అలయ్ బలయ్ వేడుకలకు ముహూర్తం ఫిక్స్
  • Annual Picnic: జీడబ్ల్యూటీసీఎస్, తానా వార్షిక పిక్నిక్‌కు రెడీ
  • Ritika Nayak: హీరోయిన్ ను అక్క అంటున్న డైరెక్ట‌ర్
  • BRS: బీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
  • Chiranjeevi: భార్య‌ను చూసి స్టెప్పులు మ‌ర్చిపోయిన మెగాస్టార్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer