టిటిఎ పొలిటికల్ ఫోరంలో పాల్గొన్న నాయకులు
న్యూజెర్సి టిటిఎ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన పొలిటికల్ ఫోరం కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తెరాస ఆలేరు ఎమ్మెల్యే సునీత, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి, భాజపా నేత ప్రదీప్ రెడ్డి, తెరాసకు చెందిన నల్గొండ జిల్లా నేత మహేందర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.టిటిఎ ప్రెసిడెంట్ ఎలక్ట్ వంశీరెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఫోరం కన్వీనర్ భాస్కర్ స్వాగతం పలికారు.
Tags :