ASBL NSL Infratech

తెలంగాణలో కనీసం 12 స్థానాల్లో... బీజేపీని గెలిపించండి : అమిత్ షా

తెలంగాణలో కనీసం 12 స్థానాల్లో...  బీజేపీని గెలిపించండి : అమిత్ షా

మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెదక్‌ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ విశాల జన సభలో అమిత్‌ షా మాట్లాడుతూ 400కు పైగా స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. తెలంగాణలో కనీసం 12 స్థానాల్లో బీజేపీనీ గెలిపించాలని ఓటర్లను కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మోదీ కృషి చేశారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నారు. మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉంది. మజ్లిస్‌కు భయపడటం వల్లే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నిర్వహించడం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కచ్చితంగా నిర్వహిస్తాం అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :