ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సిద్దిపేటలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం

సిద్దిపేటలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం

తెలంగాణలోని సిద్దిపేటలో శుక్రవారం నాడు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో 5 లక్షల రూపాయలు విలువైన పరికరాలను లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. 15 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు LAPTOP లు బహుకరించారు. ఆరుగురు వికలాంగులకు మూడు చక్రాల బ్యాటరీ సైకిళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు , తానా ఫౌండేషన్ ట్రస్టీలు రవి సామినేని, విశ్వనాధ్ నాయనిపాటి  తదితరులు పాల్గొన్నారు. తానా ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ప్రశంసించారు. తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, చైర్మెన్ యార్లగడ్డ వెంకటరమణ గార్లు విద్యార్ధినిలను అబినంధించారు.

 

Click here for Photogallery

 

Tags :