ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తాజా ఉగాది వేడుకలు... 1400 మందికి పైగా హాజరు

తాజా ఉగాది వేడుకలు... 1400 మందికి పైగా హాజరు

జాక్సన్విల్‌ తెలుగు సంఘం ‘తాజా’ నిర్వహించిన శుభకృత్‌ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక త్రాషెర్‌ హార్న్‌ సెంటర్‌ లో ఏప్రిల్‌ 16 మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11 గంటలవరకు నిర్విరామంగా జరిగిన ఈ వేడుకలు  ‘తాజా’ చరిత్రలోనే ఒక మైలురాయిలా నిలిచిపోయింది. తాజా ఉగాది వేడుకలు కూడా ఒక ఈవెంట్‌ మాత్రమే కాదు, ఇట్స్‌ ఏ బ్రాండ్‌ న్యూ ఎక్స్‌ పీరియన్స్‌లాగా సాగింది. ఎందుకంటే కోవిడ్‌ మహమ్మారి తర్వాత  మరచిపోలేని మధురానుభూతులను పంచేలా ఈ వేడుకలు జరిగాయి. 1400 మందికి పైగా హాజరైన ఈ వేడుకల్లో 450మందితో నిర్వహించిన ప్రదర్శనలు, 100 మందికి పైగా వాలంటీర్స్‌, 50 సాంస్కృతిక కార్యక్రమాలు, 15 రకాల వంటకాలతో అహుతులను అలరించేలా ఉగాది వేడుకలు మైమరపింపజేశాయి.

మొదటగా సువిశాల వేదిక ప్రాంగణంపై తాజా అధ్యక్షులు సురేష్‌ మిట్టపల్లి కుటుంబ సమేతంగా జ్యోతి ప్రజ్వలనతో మంగళకరంగా తాజా ఉగాది వేడుకలను ప్రారంభించి, ఆహుతులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపి స్వాగతించారు. శాస్త్రీయ సంప్రదాయంతో మొదలుకొని, రామ రసం, హిందోళ రాగం, పాత కొత్త సమ్మిళతంగా సినీ డ్యూయెట్స్‌, అన్‌ స్టాపబుల్‌ షో అనుకరణ వంటి కార్యక్రమాలు సభికులను ఉర్రూతలూగించాయి. ఈ సందర్భంగా తాజా గత అధ్యక్షులను గుర్తుపెట్టుకొని మరీ ఘనంగా సన్మానించడం అభినందనీయం. అలాగే ఇంత పెద్ద వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్న అన్ని కమిటీల సభ్యులను వేదికమీదికి ఆహ్వానించి ప్రతి ఒక్కరినీ అభినందించారు. కార్యక్రమాల మధ్య మధ్యలో యాదృచ్ఛికంగా అందించిన విలువైన రాఫుల్‌ బహుమతులు అందరినీ ఆకట్టుకున్నాయి.

తాజా ఉగాది వేడుకల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో బూత్‌ అందరినీ ఆకర్షించడంతో అందరూ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగుతూ కనిపించారు. తాజా ఉగాది వేడుకలు ముగింపు అనంతరం ఆహుతుల మొహాల్లో ఆనందం, ఆహ్లాదం చూస్తే తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ జాక్సన్విల్‌ ఏరియా ‘తాజా’ కార్యవర్గ సభ్యులు పడ్డ 2 నెలల కష్టం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చివరగా జాతీయగీతాలాపనతో కార్యక్రమాలు ముగిశాయి.  


‘తాజా’ ఉగాది వేడుకలు వీడియో

 

‘తాజా’ ఉగాది వేడుకలు Teaser వీడియో

 

Click here for Event Gallery

 

 

Tags :