మోదీ పదేళ్ల పాలన.. వందేళ్ల విధ్వంసం తో సమానం.. రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ పదేళ్ల పాలన వందేళ్ళ విధ్వంసాన్ని సృష్టించింది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు. ఈరోజు ఉదయం గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ బీజేపీపై 'నయవంచన - పదేండ్ల మోసం... వందేండ్ల విధ్వంసం’ అంటూ ఓ ప్రజా చార్జ్ షీట్ ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకున్న రేవంత్ రెడ్డి బీజేపీని.. మోదీ సర్కార్ ను విమర్శిస్తూ ట్వీట్ పెట్టారు. మోదీ పాలనలో భారత్ వికసించిన కమలం కాదు.. విభజించబడిన దేశమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఇది ఆర్థిక భారత్ కాదు ఆకలి భారత్ అని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు పలు రకాల డిస్కషన్స్ కు తెర లేపుతోంది.