ASBL NSL Infratech

నామినేషన్ క్లోజింగ్ రోజు టీడీపీ కు భారీ షాక్..

నామినేషన్ క్లోజింగ్ రోజు టీడీపీ కు భారీ షాక్..

ఏపీలో అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈనెల 29 వరకు వేసిన నామినేషన్లను వెనక్కు తీసుకునే వసతి ఉంది. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సర్వే మాట ఎట్టున్న.. ప్రజలు మాత్రం జగన్ ప్రభుత్వంకే జై కొడుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో కొందరు టీడీపీ కీలక నేతలు కూడా చేరిపోయారు. నామినేషన్ వేయడం కోసం సీఎం జగన్ పులివెందల వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని కలుసుకున్న చిత్తూరు జిల్లా టీడీపీ నేత.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి సతి సమేతంగా వైసీపీలో చేరారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో అనీషా రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టీడీపీ తరఫున పోటీ చేశారు. పుంగనూరులో అనీషా రెడ్డి టీడీపీ బాధ్యతలు భుజస్కందాలపై వేసుకొని నడిపించారు. అటువంటి కీలకమైన నేత ఇప్పుడు వైసీపీ గూటికి చేరడంతో అక్కడ ఆ పార్టీ పరిస్థితి బాగా బలహీనపడింది. మరో పక్క కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా సైకిల్ వదిలి ఫ్యాన్ కి తన మద్దతు తెలియపరిచారు. జగన్ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకే అందే విధంగా చేస్తున్నారని.. పేదల ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నారని శివారెడ్డి అన్నారు. ఆయన చేస్తున్న మంచి వైపు ఆకర్షితుడై పార్టీలోకి చేరుతున్నట్లుగా తెలియపరిచారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :