ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు రావాలని పలువురు కేంద్రమంత్రుల్ని ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌లు ఆహ్వానించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, సహాయ మంత్రి వీకే సింగ్‌, విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు ఆహ్వాన పత్రికలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్‌ చేసిన రంగాల గురించి ఆయా మంత్రులకు వివరించి సహకారమందించాలని కోరారు. పలువురు రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.

 

 

Tags :