ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గవర్నర్ తమిళిసైకి చినజీయర్ స్వామి ఆహ్వానం

గవర్నర్ తమిళిసైకి చినజీయర్ స్వామి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింత్‌ ఆశ్రమంలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను చినజీయర్‌ స్వామి ఆహ్వానించారు. రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఆశ్రమంలో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు మహోత్సవాలు నిర్వహిస్తున్నామని గవర్నర్‌కు వివరించారు. సమతామూర్తి పేరిట 214 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. ఫిబ్రవరి 13న నిత్య పూజల కోసం 120 కిలోల పుత్తడితో రూపొందించిన రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని,  ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను కోరారు.

 

Tags :