ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య 216 అడుగుల ఎత్తయిన విగ్రహం ఫిబ్రవరి 5న ప్రపంచానికి అంకితం కానుంది. కూర్చున్న స్థానంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా పేర్కొన్న బడిన ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నట్లు చినజీయర్‌ స్వామి ఆశ్రమం ఒక ప్రటనలో వెల్లడించింది. నగర శివార్లలోని 45 ఎకరాల కాంపెక్ల్స్‌ వద్ద రూ.1000 కోట్ల వ్యయంతో ప్రపంచ వ్యాప్తంగా భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చుకుని వీటిని రూపొందించారు. శ్రీ రామానుజాచార్యులు భూమిపై గడిచిన 120 సంవత్సరాల జ్ఞాపకార్థం 120 కిలోల బంగారంతో చేసిన రామానుజుల బంగారు విగ్రహం అంతర్భాగాన్ని ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించారు. ఫిబ్రవరి 2 నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్‌ చినజీయర్‌ స్వామితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, నటీనటులు కూడా హాజరు కానున్నారు.

 

Tags :