ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మిల్ పిటాస్ లో ముగిసిన కనకదుర్గ పూజలు

మిల్ పిటాస్ లో ముగిసిన కనకదుర్గ పూజలు

మిల్‌పిటాస్‌లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఏప్రిల్‌ 22 నుంచి 24వ తేదీ వరకు జరిగిన విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజులు ఘనంగా ముగిశాయి. మూడురోజులపాటు జరిగిన ఈ పూజల్లో ఎక్కువమంది మహిళలు పాల్గొన్నారు. బ్యాచ్‌లుగా జరిగిన పూజల్లో పాల్గొన్న భక్తుల చేత  విజయవాడ నుంచి వచ్చిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం పూజారులు అమ్మవారి పూజలను నిర్వహింపజేశారు. కుంకుమార్చనతోపాటు త్రిశతి, ఖడ్గమాల, శ్రీ లలితాసహస్రనామ పూజలను కూడా చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదంతోపాటు డాలర్‌ను, శ్రీచక్రంతో కూడిన రాగిరేకును బహూకరించారు. ఆలయ ప్రెసిడెంట్‌ వెంకట్‌ రెడ్డి ఈ పూజలను ఘనంగా నిర్వహింపజేయడంతోపాటు భక్తులకు ఎలాంటి లోటు రానీకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, శంకర శాండిల్య, కోట ప్రసాద్‌, శంకరమంచి ప్రసాద్‌, గోపాలకృష్ణలతోపాటు పిఆర్‌ఓ, ఆలయ అధికారి అచ్చుతరామయ్య, రాష్ట్ర దేవాదాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సాయికుమార్‌తోపాటు, శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పూజారులు ఇతరులు పాల్గొన్నారు.

 

Tags :