ఆధ్మాత్మిక హబ్గా సమతామూర్తి ప్రాంగణం : మంత్రి జగదీశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల లోని శ్రీరామనగర్ వద్ద త్వరలో ఆవిష్కరించనున్న శ్రీ రామానుజాచార్యులు సమతామూర్తి విగ్రహంతో ఈ ప్రాంతం అధ్యాత్మిక హబ్గా మారిపోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ముచ్చింతలలోని సమతామూర్తి విగ్రహాన్ని పరిశీలించి విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. శ్రీరామానుజాచార్యులు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగే కార్యక్రమంలో రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చినజీయర్స్వామి ఆశ్రమ ప్రాంగణంలో జరిగే విగ్రహవిష్కరణ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి విదేశాల నుండి కూడా అతిరథ మహారథలు వచ్చే అవకాశం ఉన్నందు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు పూజా కార్యరకమంలో పాల్గొనున్నారని తెలిపారు.