ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేంద్ర మంత్రులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

కేంద్ర మంత్రులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్‌ ఇన్వెస్టిమెంట్‌ సమిట్‌కు రావాలని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, మన్‌సుఖ్‌ మాండవీయ, శర్బానంద సోనోవాళ్‌, కిషన్‌ రెడ్డిలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌లు ఆహ్వానించారు. అనంతరం మంత్రి అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిన 13 రంగాలకు ఈ సమిట్‌ ఎంతో  ఉపకరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారని తెలిపారు. రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా దీనిని నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

 

Tags :