ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు.. ఈ నెల 17న చెన్నైలో

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు.. ఈ నెల 17న చెన్నైలో

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారికి గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికగా భరోసా అందిస్తామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.  దీనికి ప్రచారం కల్పించడంలో భాగంగా ఈ నెల 17న చెన్నైలో రోడ్‌ షో నిర్వహించనున్నట్లు పేర్కొంది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నాం. రాష్ట్రంలోని పటిష్టమైన మారిటైం మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనువైన  వాతావరణాన్ని పారిశ్రామికవేత్తలకు వివరిస్తాం.  తద్వారా పెట్టుబడులకు ఆకర్షించాలన్నదే లక్ష్యం. ఇప్పటికే లాజిస్టిక్స్‌లో లీడ్స్‌ అవార్డు, విద్యుత్‌లో ఎనర్షియా అవార్డులు వచ్చాయి. 3 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం అని ప్రభుత్వం పేర్కొంది. 

 

 

Tags :