ప్రధాని మోదీకి చినజీయర్ స్వామి ఆహ్వానం
భగవత్ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ప్రధాని నివాసంలో కలిసి స్వయంగా ఆహ్వాన పత్రిక అందించారు. రామానుజాచార్య సహస్త్రాబ్ధి వేడుకల విశిష్టతను మోదికి వివరించారు. జూపల్లి రామేశ్వరావు కూడా మోదీని కలిసి ప్రాజెక్టు విశేషాలను తెలియజేశారు. సమతా స్ఫూర్తి కేంద్రం విశిష్టత, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేయనున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను ప్రధాని ఈ సందర్భంగా తెలుసుకున్నారు. ప్రపంచ శాంతి కోసం చినజీయర్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఫిబ్రవరి 5న విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని హామీ ఇచ్చారు.
Tags :