ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏపీకి అన్ని విధాలుగా కేంద్రం నుంచి సహకారం : కిషన్ రెడ్డి

ఏపీకి అన్ని విధాలుగా కేంద్రం నుంచి సహకారం : కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్రం నుంచి సహకారం అందిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.  విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొదవ లేదన్నారు. పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రోడ్లు, రైల్వే, పోర్టుల వంటి రంగాల్లో అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. దేశంలో అంతర్జాతీయ  రహదారుల అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. పలు కీలక రంగాల్లో కనెక్టివిటీ బాగా పెరిగింది. నూతన భారత నిర్మాణం వేగంగా జరుగుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం అందుతోంది. గత 9 ఏళ్లలో రైల్వే బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశాభివృద్ధికి సహకరిస్తున్న పెట్టుబడిదారులకు అభినందనలు తెలిపారు.

 

 

 

Tags :