ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డల్లాస్ లో వైఎస్ జగన్ పర్యటనపై సమీక్షా సమావేశం

డల్లాస్ లో వైఎస్ జగన్ పర్యటనపై సమీక్షా సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికా వస్తున్న  వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పర్యటన విజయవంతం కోసం డల్లాస్‌ నగరంలో సమీక్షా సమావేశం జరిగింది. ఇర్వింగ్‌లోని అల్టిమేట్‌ బార్బిక్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన తుది సన్నాహక సమావేశంలో ఆతిథ్య, సాంస్క తిక, రవాణా, ఆహార, రిజిస్ట్రేషన్‌, స్వాగత, భద్రత తదితర విభాగాలకు చెందిన కార్యకర్తలు ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు.

టెక్సాస్‌ వ్యాప్తంగా ఆస్టిన్‌, హ్యూస్టన్‌ నగరాల నుండి ప్రవాసుల రవాణా కోసం ప్రత్యేకంగా 25బస్సులు ఏర్పాటు చేశామని రవాణా విభాగం సభ్యులు తెలిపారు. కన్వెన్షన్‌ సెంటరు సమీపంలోని హోటళ్లల్లో 200కుపైగా గదులు ఇప్పటికే ప్రముఖులు, అతిథుల కోసం బుక్‌ చేశారు. ఆహార కమిటీ స్పందిస్తూ 7నుండి10 వేల రానున్న ఈ సభకు శుక్ర, శనివారాల్లో ఆహార ఇబ్బందులు తలెత్తకుండా డిఎఫ్‌డబ్ల్యు పరిసర ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్ల వారితో ఒప్పందాలు చేసుకున్నామని పేర్కొన్నారు. సభ జరిగే డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటరు వద్ద 1300కు పైగా పార్కింగ్‌ స్థలాలు అతిథులు ఉచితంగా పార్కింగ్‌ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

వై.ఎస్‌.జగన్‌ పర్యటనలో ఎటువంటి అపశతి చోటు చేసుకోకుండా ఆయన డల్లాస్‌ విమానాశ్రయంలో దిగినప్పటి నుండి తిరిగి శనివారం సాయంత్రం సభ ముగిసేవరకు హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్‌తో పాటు స్థానిక కార్యకర్తలు తీసుకోవల్సిన భద్రతాపరమైన సహాయక చర్యలపై చర్చించారు. సాంస్కతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రవాస యువత, చిన్నారులు ఆకట్టుకునే కార్యక్రమాలను రూపొందిస్తున్నారని తెలిపారు. డల్లాస్‌వ్యాప్తంగా ఇప్పటికే జగన్‌కు స్వాగతం పేరిట ఏర్పాటు చేసిన హోర్డింగులతో పాటు మరిన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా ప్రకటనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సన్నాహక సమావేశంలో డల్లాస్‌కు చెందిన నిర్వాహక బంద సభ్యులు డా.కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, రత్నాకర్‌, శివా అన్నపురెడ్డి, క్రిస్టపాటి రమణ్‌రెడ్డి, దర్గా నాగిరెడ్డి, తిరుమలరెడ్డి, ఓబుల్‌రెడ్డి శ్రీనివాసరెడ్డి, శారద సింగిరెడ్డి, ఉమా కుర్రి, విశ్వనాధ్‌ కిచిలి, చింతల చంద్రారెడ్డి, ఫాల్గుణ్‌రెడ్డి, ఇస్మాయిల్‌, కష్ణారెడ్డి, ఆదిత్య, మణి అన్నపురెడ్డి, డా.పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :