భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు దేశంలోనే అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడులోని కృష్ణగిరిలో కంపెనీ తన సెల్ ఫ్యాక్టరీ యొక్క మొదటి పిల్లర్ను భిగించి పనులను మొదలు పెట్టింది. Ola Gigafactory అత్యంత వేగవంతగా నిర్మింపబడిన సెల్ ఫ్యాక్టరీలలో ఒకటిగా నిలువనుంది. తయారీ రంగం లో విప్లవాత్మక మార్పులు మరియు EV విప్లవాన్ని భారతదేశం నుండి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ ఫ్యాక్టరీ దోహదపడుతుంది.
సుమారు 115 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓలా గిగాఫ్యాక్టరీ వచ్చే ఏడాది ప్రారంభంలో 5 GWh ప్రారంభ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇది దశలవారీగా 100 GWhకి విస్తరించబడుతుంది. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఓలా గిగాఫ్యాక్టరీ భారతదేశంలోనే అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీ అవుతుంది మరియు పూర్తి సామర్ధ్యానికి విస్తరించినప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సెల్ తయారీ సౌకర్యాలలో ఒకటిగా నిలుస్తుంది.
ఓలా వ్యవస్థాపకుడు మరియు CEO భావిష్ అగర్వాల్ మాట్లాడుతూ “ఈ రోజు మేము మా గిగాఫ్యాక్టరీ మొదటి పిల్లర్ను ఇన్స్టాల్ చేయడం మాకు గర్వకారణం. భారతదేశ విద్యుదీకరణ ప్రయాణంలో మా గిగాఫ్యాక్టరీ ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది, భారతదేశాన్ని గ్లోబల్ EV హబ్గా మార్చడానికి మమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ఇన్నోవేషన్, టెక్నాలజీ మరియు భారీ మ్యానుఫ్యాక్చరింగ్ పై మా దృష్టితో, మేము ఓలా ఎలక్ట్రిక్ యొక్క భవిష్యత్తుకి మరియు #ఎందిసీజ్ నినాదానికి కట్టుబడి ఉన్నాము.
ఓలా గిగాఫ్యాక్టరీ అనేది ఓలా యొక్క ఆశయం మరియు దాని సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం మాత్రమే కాదు, గ్లోబల్ EV హబ్గా మారే భారతదేశ సామర్థ్యాన్ని గ్రహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు కూడా. EV వాల్యూ చైన్లోని అన్ని కీలక అంశాలను స్థానికీకరించడం, దేశాన్ని స్వావలంబనతో శక్తివంతం చేయడం మరియు ఎలక్ట్రిక్ వాహనం వృద్ధిని పెంచడమే ఓలా లక్ష్యం.
ఓలా సెల్ & బ్యాటరీ R&D పై భారీగా పెట్టుబడి పెట్టింది మరియు బెంగుళూరులో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అధునాతన సెల్ R&D సౌకర్యాలలో ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఓలా యొక్క బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్ కోర్ సెల్ టెక్ డెవలప్మెంట్ మరియు బ్యాటరీ ఆవిష్కరణలకు మూలస్తంభంగా వ్యవహరిస్తోంది.
కంపెనీ తన తయారీ సామర్థ్యాలను 2Ws, 4Ws మరియు సెల్లలో విస్తరించడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఇటీవల ఒక MoU సంతకం చేసింది. ఎమ్ఒయులో భాగంగా, ఓలా ఒక EV హబ్ను ఏర్పాటు చేస్తుంది. ఇది అధునాతన సెల్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సౌకర్యాలు, విక్రేత మరియు సరఫరాదారుల పార్కులు మరియు EVల కోసం అతిపెద్ద సహాయక పర్యావరణ వ్యవస్థను ఒకే ప్రదేశంలో ఉంచుతుంది.






