ఖరీదైన సిటీగా ముంబై
దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గిందని దీనికి రుణాల వడ్డీ రేట్లు, ఇళ్ల ధరల్లో పెరుగుదల కారణమని పేర్కొంటూ, దేశంలో రియల్ ఎస్టేట్పై జేఎల్ఎల్ ఇండియా నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం హైదరాబాద్, పుణే, కోల్కతా నగరాల్లో నివాస గృహాల మార్కెట్ అందుబాటులోనే ఉందని తెలిపింది. ముంబై మాత్రం ఖరీదైన నగరంగా మారిందని పేర్కొంది. హోమ్ పర్చేజ్ అఫర్టబిలిటీ ఇండెక్స్ (హెచ్పీఏఐ) పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. సగటు వార్షిక ఆదాయాన్ని ఆర్జించే కుటుంబం ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం ఆయా నగరాల్లో ఒక ఆస్తికి ఎంత మేర గృహ రుణం పొందగలరు అనే అంశాన్ని ఇది సూచిస్తుంది. గృహరుణ వడ్డీ రేట్లు, సగటు కుటుంబ ఆదాయం, నివాస గృహాల ధరల ఆధారంగా స్థోమత సూచినీ నిర్ణయిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 1000 చదరపు అడుగల విస్తీరణంలో ఉన్న ప్లాట్ కొనేందుకు గృహ రుణం పొందాలంటే, ఆ వ్యక్తికి ఉండాల్సిన కనీస ఆదాయాన్ని కుటుంబ ఆదాయంగా నిర్వచించింది.






