India :పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

కశ్మీర్ గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత (India) ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ (Kashmir) తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది? కశ్మీర్ భారత భూభాగం అని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal )మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Asim Munir) మాట్లాడుతూ కశ్మీర్ విషయంలో మా వైఖరి సరైనది. ఆ ప్రాంతం మా జీవనాడి. దానిని మేం మర్చిపోలేం అని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో భారత్ స్పందన వచ్చింది. ఈ అంశంలో మనదేశం ఎప్పటికప్పుడు తన వైఖరిని బలంగా వినిస్తోంది.