మోదీ అమెరికా పర్యటనలో.. కీలక డీల్!
భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందే అమెరికాతో చర్చకు రానున్న పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా భారత్ ఎదుట సాయుధ డ్రోన్ల ఆఫర్ను అమెరికా ఉంచినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు పేర్కొన్నారు. దాదాపు డజను సాయుధ డ్రోన్లు విక్రయించేలా ఈ డీల్ ఉందని వారు వెల్లడిరచారు. భారత్ కూడా చాలా కాలంగా అమెరికా నుంచి సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ, బ్యూరో క్రటిక్ ఇబ్బందులతో ఈ డీల్ ముందుకు వెళ్లడం లేదు. జూన్ 22న మోదీ శ్వేతసౌధం పర్యటన ఈ డీల్ను ఓ కొలిక్కి తెస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికా మోదీ పర్యటన ఖరారు కాగానే డ్రోన్ విషయంలో పురోగతి చూపించాలని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్, పెంటగాన్ అధికారులు భారత్ను కోరారు. దాదాపు 30 ఎంక్యూ`9బి సీ గార్డియన్ డ్రోన్లను విక్రయించాలని భావిస్తోంది. చీ పర్యటనలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య పలు ఆయుధాల తయారీ, నిర్వహణపై చర్చలు జరగనున్నాయి.






