BRS: డల్లాస్ లో అన్ని సంస్థల ప్రముఖలందరితో సన్నాహక సభ

బీఆర్ఎస్ (BRS) పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ (Dallas) ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డల్లాస్ లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. దీనిలో భాగంగా డల్లాస్ లో అన్ని సంస్థల ప్రముఖలందరితో సన్నాహక సభ జరిగింది. వక్తలు అందరూ మాట్లాడుతూ కేటీర్ గారి రాక గురించి అందరం ఎదురు చూస్తున్నాం అని అన్నారు.
NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ చాల సంతోషంగా వుంది, ఈ కార్యక్రమం చిన్న రజతోత్సవ సభ లాగా వుంది, డల్లాస్ లో వున్నా అందరూ ప్రముఖులు రావడం సంతోషం గ వుంది , జూన్ 1 నాడు మీ కుటుంబ సభ్యులు, మీ ఉద్యోగులు అందరూ బారి ఎత్తున రావాలి అని కోరారు. అన్ని రకాల పనులు ఊపందుకున్నాయి, అందరూ భాగస్వమ్యులు కావాలి అని పిలిపు నిచ్చారు. ఈ సభను నిర్విహించడానికి కొద్దీ సమయములోనే సమన్వయ పరిచి సురకంటి శ్రీనివాస్ ని మహేష్ బిగాల అభినందిచారు.
BRS USA Advisory Chair మహేష్ తన్నీరు మాట్లాడుతూ తెలంగాణ నుంచి కళాకారులూ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది, అన్ని రకాల సాంసృతిక కార్య్కర్మాలతో సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం అని చెప్పారు.
ఈ సభకు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్లే కోరుకంటి చందర్, కోలేటి దామోదర్, అందరూ విమానాశ్రయం నుంచి వచ్చి సభకు హాజరు అయ్యారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మీ అందరితో పటు కేటీర్ గారు సభకు వేచి చూస్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 25 ఏండ్లు మనుగడ సాగించిన పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అని పేర్కొన్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను అట్టహాసంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో డాలస్లో ఈ కార్యకమాన్ని జరగబోతుంది అని అన్నారు.