64 విమానాల ద్వారా స్వదేశానికి 15 వేల మంది
కరోనా లాక్డౌన్తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సుమారు 14,800 మందిని తరలించడానికి 64 విమానాలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్ని విమానాలు బుధవారం వెళ్లనున్నాయని తెలిసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. విదేశీ విమానాలను దేశంలోకి అనుమతించడం లేదు. దీంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయూలు స్వదేశానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. మే 7 నుంచి 13 వరకు మొత్తం 12 దేశాల్లోని భారతీయుల్ని వెనక్కి తీసుకురానున్నట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఆ 12 దేశాలివే :
యూఏఈ, యూకే, అమెరికా, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, మలేషియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, బెహ్రెయిన్, కువైట్, ఒమాన్. యూఏఈకు 10 విమానాలు, అమెరికా, యూకేలకు చెరో ఏడు విమానాలను నడపనుంది. అలాగే, సౌదీ అరేబియాకు ఐదు, సింగపూర్కు ఐదు, ఖతార్ నుంచి రెండు చొప్పున విమానాలు నడపనుందని సదరు అధికారి వెల్లడించారు.






