ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అమెరికాలోనే …..త్వరలో ఇతర దేశాలకూ
బిలియనీర్ ఎలాన్ మస్క్ అధీనంలోకి వెళ్లిన తర్వాత సామాజిక మాధ్యమం ట్విటర్ లో అనేక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా యూజర్లు తమ కంటెంట్ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు మస్క్ వెల్లడించారు. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ను పెట్టుకుని డబ్బులు ఆర్జించుకోవచ్చని తెలిపారు. సెట్టింగ్స్లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే సరిపోతుందని వెల్లడిరచారు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అమెరికాలోనే ఉందని తెలిపారు. త్వరలో ఇతర దేశాలకూ విస్తరిస్తామని తెలిపారు. ఇలా తమ కంటెంట్ ద్వారా యూజర్లు సంపాదించిన డబ్బు నుంచి వచ్చే 12 నెలల పాటు ట్విటర్ ఎలాంటి రుసుములూ తీసుకోబోమని మస్క్ వెల్లడించారు.
అంటే సబ్స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన డబ్బులో గరిష్ఠంగా 70 శాతం వరకు యూజర్లకే వచ్చేస్తుందని తెలిపారు. ట్విటర్ ద్వారా ఆర్జిస్తున్న మొత్తంలో నుంచి ఐఓఎస్, ఆండ్రాయిడ్ 30 శాతం యాప్స్టోర్ ఫీజు కింద వసూలు చేస్తోంది. వెబ్లో అయితే 92 శాతం వరకు ఆదాయం యూజర్లకే చెందుతుందని మస్క్ స్పష్టం చేశారు. అలాగే కంటెంట్ను ప్రమోట్ చేసుకునేందుకూ ట్విటర్ సహకరిస్తుందని తెలిపారు. కావాలంటే ఎప్పుడైనా తమ కంటెంట్తో సహా ట్విటర్ నుంచి బయటకు వెళ్లొచ్చని పేర్కొన్నారు.






