అమెరికాలో గ్రాన్యూల్స్ కేంద్రం ప్రారంభం
అమెరికాలోని వర్జీనియాలో తమ అనుబంధ సంస్థ గ్రాన్యుల్స్ కన్జూమర్ హెల్త్ (జీసీహెచ్) ద్వారా ప్యాకేజీంగ్ కేంద్రాన్ని గ్రాన్యూల్స్ ఇండియా ప్రారంభించింది. 79,000కు పైగా చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో ప్యాకేజింగ్ లైన్స్, క్లీన్ రూమ్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అమెరికా మార్కెట్లో ఎక్కడికైనా ఇక్కడి నుంచి ఔషధ ఉత్పత్తులను పంపొచ్చు. ఈ కేంద్రానికి ఇటీవల యూఎస్ఎఫ్డీఏ సున్నా అభ్యంతరాలతో అనుమతి లభించిందని గ్రాన్యూల్స్ తెలిపింది. అమెరికాలో భారత అంబాసిడర్గా ఉన్న తరుణ్జిత్ సింగ్ సందు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అతుల్ కేషప్, సెలెక్ట్ యూఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్టిస్ సింగ్, కన్జూమర్ హెల్త్కేర్ ప్రోడక్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్కాట్ మెల్విలే, ప్రిన్స్ విలియం కౌంటీ ఎగ్జిక్యూటివ్ క్రిస్ షార్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






