27వేల మంది తొలగింపు.. అమెజాన్ సీఈవో కీలక వ్యాఖ్యలు
ఉద్యోగుల తొలగింపుపై ఇ`కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థలో 27 వేల మందిని తొలగించడం అనేది చాలా కఠినమైన నిర్ణయం, కానీ తప్పలేదని తెలిపారు. ఖర్చులను నియంత్రించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు సంస్థ అధికారి వెబ్సైట్లో ఆయన ఒక లేఖను పోస్ట్ చేశారు. కంపెనీ ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ వాటాదారులకు సీఈవో వార్షిక లేఖ రాశారు. ఖర్చు తగ్గించే ప్రయత్నాలు కంపెనీ వృద్ధికి సహాయపడతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగులను తొలగించే నిర్ణయం కష్టమైనదే కానీ దీర్ఘకాలంలో కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ సంక్షేమంపై లోతుగా సమీక్షిస్తూ, ఒక్కో బిజినెస్ను స్టడీ చేసిన అనంతరం తీసుకున్న తమ నిర్ణయంతో రానున్న రోజుల్లో కంపెనీకి మంచి జరుగుతుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు.






