స్థానిక నాయకత్వంతో చర్చించిన తర్వాతే.. ఇతర పార్టీల నేతలను
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన తర్వాత ఢిల్లీలో కీలక సమావేశాలు ఉంటాయని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నేతలతో రాహుల్, ఖర్గే సమావేశం కానున్నట్లు తెలిపారు. రాహుల్తో తెలంగాణ నేతల సమావేశం ఎప్పుడు అనేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో పార్టీ ఊపందుకుందని వెల్లడిరచారు. స్థానిక నాయకత్వంతో చర్చించిన తర్వాతే ఇతర పార్టీల నేతలను పార్టీలోకి చేర్చుకుంటామని స్పష్టం చేశారు.
Tags :