రూ.70 కోట్లు విరాళమిచ్చిన రేమండ్ సంస్థ
మహారాష్ట్ర ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి, ఆశీర్వదించడానికి తిరుమల బాలాజీ నవీ ముంబయిలో కొలువుదీరబోతున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సంతోషం వ్యక్తం చేశారు. నవీ ముంబయిలోని ఉల్వేలో పదెకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమల ఆలయం తరహాలో స్వామివారి ఆలయం నిర్మించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారన్నారు. నిర్మాణానికయ్యే ఖర్చు రేమండ్ సంస్థ రూ.70 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించారు.
Tags :