నేడే టీడీపీ 42 వ ఆవిర్భావ దినోత్సవం..
ఈరోజు తెలుగు వాడి ఆత్మ గౌరవం పరిరక్షణకు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన టీడీపీ పార్టీ 42వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు, సంబరాలు జరుపుకుంటున్నారు. ఎక్స్ వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు ,అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ”తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు ,నేతలకు.. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ,అంబేద్కర్ ,పొట్టి శ్రీరాములు, జ్యోతిబాయ్ ఫూలే లాంటి ఎందరో మహా నేతల స్ఫూర్తిగా.. 1982లో ఇదే రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు. రాజకీయం అంటే కేవలం అధికారం కాదని.. ప్రజల సేవ కొరకు పాటుపడడం అని భావించిన ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరిచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి.. అభ్యున్నతి ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తు కు కృషి చేస్తోంది..”అంటూ ఓ ప్రత్యేకమైన ట్వీట్ పెట్టారు. ఆయన పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.