ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీసీఎస్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు త్వరలో!

టీసీఎస్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు త్వరలో!

ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల వేతనాలు పెంచనుంది. ఆఫ్‌సైట్‌ ఉద్యోగులకు సగటున 7 నుంచి 8 శాతం ఆన్‌సైట్‌ ఉద్యోగులకు 2`4 శాతం పెంచే యోచనలో  ఉందని తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12`15 శాతం వరకు జీతం పెంచనున్నట్లు పేర్కొంది. టీసీఎస్‌ ఉద్యోగుల వేతన పెంపు ప్రక్రియ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ వేతన పెంపు అమల్లోకి వస్తుందని సమాచారం. అయితే ఉన్నత స్థాయిలో ఉన్న వారి పదోన్నతలు, ఖర్చులపై ఉన్న ఆందోళనల్ని ఇంకా కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.  ప్రమోషన్లకు సంబంధించిన ప్రక్రియను కూడా తొలి త్రైమాసికంలోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉంటకింది. ఇలాంటి ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించడం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని టీసీఎస్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :