ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బుచ్చిబాబు మూవీ రంగ‌స్థలంకి మించి ఉంటుంద‌ట‌

బుచ్చిబాబు మూవీ రంగ‌స్థలంకి మించి ఉంటుంద‌ట‌

ఆస్కార్ అవార్డ్సుకి వెళ్లి అక్క‌డ కార్య‌క్ర‌మాల‌న్నీ ముగించుకుని ఇండియాకు వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్, ఇండియా టుడే నిర్వ‌హించే కాంక్లేవ్ కోసం ఢిల్లీ వెళ్లాడు. అక్క‌డ ప‌లువురు ప్ర‌భుత్వ పెద్ద‌లు, మంత్రుల‌తో పాటుగా అమిత్‌షాని కూడా క‌లిసి చ‌ర‌ణ్ ఫోటోలు దిగాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

అయితే వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మంలో చ‌ర‌ణ్, మోడీ ఇద్ద‌రూ ఒకే స్టేజీని పంచుకోవాల్సి ఉంది కానీ అది నిజం కాలేదు. ఈ ఈవెంట్‌లో చ‌ర‌ణ్ ఒక్క‌డే సోలోగా ఉన్నాడు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య‌లు చేశాడు. ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌ని బుచ్చిబాబుతో చేసే సినిమా గురించి చ‌ర‌ణ్ దారుణ‌మైన ఎలవేష‌న్లు ఇచ్చాడు. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి స‌బ్జెక్ట్ రాలేదని, చాలా కొత్త‌గా ఉంటుంద‌ని, త‌న కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటైన రంగ‌స్థలంని మించి ఇందులో పెర్ఫార్మెన్స్ చేయ‌డానికి వీలుంద‌ని, ఈ స్టోరీ కేవ‌లం ఇండియ‌న్స్‌కే కాక వెస్ట్ర‌న్ ఆడియ‌న్స్‌ని కూడా మెప్పించేలా ఉండ‌నుంద‌ని అని తెగ ఎలివేట్ చేశాడు. వాస్త‌వానికి చ‌ర‌ణ్ ఫ్యాన్స్ అంతా శంక‌ర్ తో చేస్తున్న సినిమా గురించి ఏదైనా చెప్తాడ‌నున్నారు కానీ బుచ్చిబాబు మూవీ న్యూస్ చెప్పి చ‌ర‌ణ్ అంద‌రూ అవాక్క‌య్యేలా చేశాడు. 

ఏదైతే ఏంటి చ‌ర‌ణ్ ఏదొక సినిమా గురించి అప్డేట్ అయితే ఇచ్చాడు. రంగ‌స్థ‌లాన్ని మించి ఉంటుంద‌న్నాడంటే మ‌రోసారి త‌ను విలేజ్ డ్రామా చేయ‌బోతున్నట్లు చ‌ర‌ణ్ చెప్ప‌క‌నే చెప్పాడు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్ నుంచి ఉంటుంద‌ని కూడా చ‌ర‌ణ్ క్లారిటీ ఇచ్చేశాడు. అంటే శంక‌ర్ సినిమాను ద‌స‌రా లోపు పూర్తి చేయాల్సి ఉంది. మ‌రి ఈ లోపు శంక‌ర్ ఆర్సీ15ని కంప్లీట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :