టైటిల్ తో హైప్ పెంచుతున్న ప్రశాంత్ వర్మ
హను మాన్ సినిమాతో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి వెళ్లిపోయాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. దీంతో ప్రశాంత్ వర్మ త్వరలోనే బాలీవుడ్ లో గ్రాండ్ గా డెబ్యూ ఇవ్వనున్నాడన్న వార్త కొద్ది రోజులుగా నెట్టింట ప్రచారమవుతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమాకు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడని టాక్. కానీ దీని గురించి యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లీక్స్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పై హైప్ ను పెంచుతున్నాయి. అందులో మొదటిది టైటిల్. ఈ సినిమాకు రాక్షస్ లేదా బ్రహ్మరాక్షస అనే టైటిల్ ను అనుకుంటున్నారట. స్వాతంత్య్రం రాకముందు బ్రిటిషర్ల పాలన జరుగుతున్న టైమ్ లో జరిగిన ఓ అరుదైన సంఘటన ఆధారంగా ప్రశాంత్ వర్మ ఈ ఫాంటసీ స్టోరీని రెడీ చేశాడట.
ఇప్పటికే రణ్వీర్ కు ఫైనల్ నెరేషన్ కూడా ఇచ్చాడని, రీసెంట్ గా హనుమాన్ జయంతి సందర్భంగా ముంబైలో ఈ సినిమాను లాంచ్ చేశారని కూడా అంటున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తో పాటూ మరో రెండు నిర్మాణ సంస్థలు కూడా కలిసి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్నదేనట. మరో రెండు నెలల్లో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్సుంది.